Tuesday, August 24, 2010

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 24-8-2010

  • నల్లమోతు నాసరయ్య గారికి సోదరి చాగంటి అమరమ్మగారు,
  • చాగంటి శ్రీనివాసరావు గారికి సోదరి నల్లమోతు సదాలక్ష్మిగారు,
  • నల్లమోతు అమరేశ్వరరావు గారికి సోదరీమణులైన జి. అనూష,ఎం.పద్మావతి,ఎం. ఉమామహేశ్వరి, బి.కృష్ణకుమారిలు,
  • వేములపల్లి నరేష్ గారికి సొదరి ఎన్. నాగలక్ష్మిగారు,
  • చిగురుపాటి భవానిరావు గారికి సి.డి. పాఠశాల ఉపాధ్యాయులు ఎం.కుమారస్వామి, ఎస్. శ్రీనివాసరావులు,
  • గాలి సుధీర్ గారికి సొదరి సులేఖ చౌదరి గారు,
  • వేములపల్లి నరేంద్ర గారికి సోదరీమణులు ప్రియాంక, రాధిక గార్లు,
  • వేములపల్లి శివబాబు గారికి సోదరి శ్రీలక్ష్మిగారు,
  • నల్లమోతుమురళి గారికి సోదరి మునమ జ్యోతి గారు,
  • వేములపల్లి చంద్రకాంత్, అజయ్ లకు మన్నె అమృత
మరియు సోదరి మణులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!!

Sunday, August 22, 2010

నాదెండ్ల విహంగ వీక్షణం (మచ్చు గట్టు నుండి)

గ్రామ పంచాయతి కార్యాలయం, వెనుకగా పెద్ద బడి (ప్రాధమిక పాఠశాల)

గంగమ్మ గట్టు
తాత కొండ
శివాలయం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, మసీదు ,ఎండుగుం పాలెం డొంక...

గోవర్ధన స్వామి ఆలయం
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం , వెనుకగా చలం కొండలు
అమరయ్య స్వామి మఠం
కాలనీ
పెద్ద చర్చి , నాయన గారి నివాసం.

నాదెండ్ల నుండి తిమ్మాపురం రోడ్, చెరువు.
నాదెండ్ల నుండి గణపవరం రోడ్, బట్టుకుంట

ఆలయముల ఫోటోలు

  1. వీరాంజనేయస్వామి దేవాలయం(హరే రామ గుడి)
  2. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం(కొండ మీద గుడి)
  3. గోవర్ధనగట్టు (తాత కొండ)
  4. మచ్చు గట్టు
  5. శివాలయం
  6. గోవర్ధన స్వామి గుడి
  7. చలం కొండలు
  8. వెంకటేశ్వర స్వామి కళ్యాణం-2010
  9. సి.డి స్కూలు

అన్నాప్రగడ కామేశ్వరరావు - 2 వ భాగం

సైన్యం నుండి తొలగించ బడిన తరువాత కామేశ్వరరావు గారు స్వగ్రామమైన నాదెండ్ల వచ్చారు . చుట్టు పక్కల గ్రామాలలోని దేశభక్తులను పోగుచేసుకొని పల్నాడు పుల్లరి ఉద్యమానికి మద్దతుగా పల్నాడు ప్రాంతంలో పర్యటించారు . ప్రభుత్వానికి పన్నులు చెల్లించవద్దని ప్రజలను రెచ్చగొడుతున్నారనే అభియోగంపై నరసరావుపేట సబ్ కలెక్టర్ జంబునాథ్ అయ్యర్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠిన కారాగార శిక్ష విధించి ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. జైలులో కాంగ్రెస్ నాయకులు మరియు ఇతర విప్లవ యోధులతో కలసి అయన మరింత రాటుదేలాడు. అనంతరం ఆయనను రాజమండ్రి నుండి కడలూరు జైలుకు మార్చారు.శిక్ష పూర్తి కాగానే అయన జైలు నుండి విడుదలై స్వగ్రామం చేరుకున్నారు.

కామేశ్వరరావు స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో తండ్రి రోశయ్య కారణం ఉద్యోగానికి రాజీనామా చేసారు. కుటుంబం ఆర్ధిక పరిస్థితి దీనంగా మారింది. కనపర్తి లో ఉన్న మేనమామ నిత్యానందం గారి వద్ద డబ్బులు తీసుకోని గయలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సభలకు వెళ్లారు. 1924 లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభల నిర్వహణకు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వమని నిర్వాహకుల ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లారు. శిక్షణ పూర్తి చేసి సభలు జరిగే సమయాన తల్లి కాన్సర్ వ్యాధితో చనిపోతే, జాతీయ నాయకుల ఆదేశం మేరకు మధ్యలోనే ఇంటికి వచ్చారు. ప్రతి సంవత్సరం జరిగే కాంగ్రెస్ సమావేశాలకు హాజరు కావటం, అక్కడకు వచ్చే భావసారుప్యత గల విప్లవ నాయకులతో చర్చలు జరపటం చేసేవారు.

రష్యా వెళ్ళి రెడ్ ఆర్మీలో శిక్షణ పొందాలనే కోరికతో మిత్రుల సయం కోసం బొంబాయి వెళ్ళాడు. అక్కడ ఉన్న సదాశివన్(ఎం.ఎస్.సుబ్బ లక్ష్మి భర్త ), సావర్కర్ సోదరుల సహకారంతో రష్యా బయలుదేరాడు. దారిలో క్వెట్టాలో పోలీసులచే పట్టుబడి మరల బొంబాయి వచ్చారు. సావర్కర్ సోదరుల సలహాతో బరోడాలో వ్యాయామశాలలో ఎనిమిది నెలల శిక్షణ తీసుకున్నారు. బరోడా కేంద్రంగా విప్లవ కారులకు రహస్యంగా సాయుధ శిక్షణ ఇవ్వసాగారు.

భగత్ సింగ్ , చంద్ర శేఖర్ ఆజాద్, సుఖదేవ్, రాజ్ గురు ఆహ్వానం మేరకు కాన్పూర్ వెళ్లారు. అప్పటికే ఆజాద్ సారధ్యంలో భగత్ సింగ్ నేతృత్వంలో విప్లవ చర్యలు చేపడుతూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీకి ఝాన్సీ లక్ష్మిబాయి అనుచరుడైన నానాసాహెబ్ జన్మస్థలమైన "బిత్తూర్" అడవుల్లో సైనిక శిక్షణ ఇచ్చి వారిని మరింత రాటు దేల్చారు.

శబీన్ బోస్, మరికొంత మంది సత్యగ్రహులతో కలసి బారిసాలలో సత్యాగ్రహం చేశారు. అక్కడ 3 నెలలు జైలు శిక్ష అనుభవించారు. తర్వాత లుధియానా వెళ్లి మదన్ మోహన్ మాలవ్యా , లాలాలజపతి రాయ్ లను కలిసారు. 1928 ఫిబ్రవరి 3 తేదిన సైమన్ కమీషన్ పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుత ఆందోళన జరుపుతున్న లాలా లజపతి రాయ్ ను పోలీసులు లాఠీలతో కొట్టి ఛాతి మీద బాదారు. తీవ్రంగా గాయపడిన అయన కోమాలోకి వెళ్లారు. నవంబర్ 19 అయన మరణించారు. (సశేషం...)

Monday, August 16, 2010

చాగంటి శ్రీనివాస రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 16-08-2010

చాగంటి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు
అక్క,బావ:
నల్లమోతు సదాలక్ష్మి, శ్రీనివాసరావు
మేనకోడలు,మేనల్లుడు:
అవని,మిన్ను
అమ్మ:
చాగంటి అమరమ్మ

Sunday, August 15, 2010

అన్నాప్రగడ కామేశ్వర రావు - 1 వ భాగం

64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో...


అన్నాప్రగడ కామేశ్వరర రావు గారు 1902 లో జన్మించారు. తండ్రి రోశయ్య, తల్లి లక్ష్మి దేవి. రోశయ్య గారు నాదెండ్ల గ్రామకరణంగా ఉండేవారు.ఆయనకు మంచి పేరు ఉండేది. కామేశ్వరరావు గారు ప్రాథమిక విద్యనూ గ్రామంలో పూర్తి చేసారు.అయన చిన్నప్పటి నుండి విప్లవ భావాలూ కలిగి ఉండేవారు. 1915 లో కర్నూలు లో మున్సిపల్ హై స్కూల్ లో చదివే టప్పుడు జాతీయ జెండా ఎగురవేసి వందేమాతరం గీతం పాడినారు.

బ్రిటిష్ వారిపై పోరాడాలంటే సైనిక శిక్షణ అవసరమని భావించాడు. 1917 లో నర్సింగ్ పూర్లో సైనికునిగా చేరాడు. జబల్ పూర్ , కంటే నగర్ లో సైనిక శిక్షణ పొందారు. రెండు సంవత్సరాలలో అసామాన్య ప్రతిభ చూపి అధికారిగా ఎదిగాడు.అందుకే సైన్యంతో అందరు 'బర్డి' అనే మారు పేరుతొ పిలిచేవారు.

1919 మే నెలలో బాగ్దాద్ - బస్రా ల మధ్యనున్న ప్రాంతం లోని బద్దూ జాతి ప్రజల తిరుగుబాటుని అనిచివేయటానికి పంపిన సైన్యానికి అధికారిగా ఉన్నారు. అక్కడు ఉంటూనే భారతదేశానికి స్వతంత్రం కావాలని పత్రికల్లో వ్యాసాలు రాసారు. ఈ ప్రాంతంలోని బ్రిటిష్ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపినా నేరానికి బ్రిటిష్ ప్రభుత్వం కోర్ట్ మార్షల్ చేసి ఆయనకు ఉరి శిక్ష విధించింది. భారత దేశం లోని అన్ని ప్రాంతాలలోనే కాకా, వలస దేశాలలో వచ్చిన తిరుగుబాటు వలన, సైన్యంలో చెలరేగిన ఆందోళన వలన ఉరి శిక్ష రద్దు చేసి, సైన్యం నుండి తొలగించారు. ( సశేషం....)

Thursday, August 5, 2010

నారాయణ స్వామి ఆరాధన 02-08-2010

నాదెండ్ల గ్రామంలో వేంచేసియున్న నారాయణ స్వామి వారి ఆరాధనోత్సవాలు ది.02-08-2010 సోమవారం ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా స్వామి వారిని ఆదివారం సాయంత్రం ఊరేగించారు. భక్తులు స్వామి వారికి వారు పోసి కొబ్బరి కాయలు, కానుకలు చెల్లించారు. సోమవారం ఉదయం నారాయణ స్వామి మఠం లో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారికి భక్తులు పది మానికల పొంగలి, పది మానికల పులిహోర సమర్పించి అనంతరం ప్రసాదములు పంచినారు. సాయంత్రం ఎనిమిది గంటలనుండి స్వామి వారి భజనలు జరిగాయి.

శ్రీ స్వామి వారి ఆరాధన ఉత్సవాలు ప్రతి సంవత్సరం స్వామి వారు సజీవ సమాధి పొందిన రోజు అనగా ఆషాడ బహుళ సప్తమి నాడు జరుగును. ఈ రోజు మిట్టపల్లి లోని పెద్ద మఠం లో కూడా ఘనంగా ఉత్సవాలు జరుగును.


Note: This post is publised from 'CITY INTERNET AND CELLWORLD', KALAMANDIR CENTER, CHILAKALURIPET.

Monday, August 2, 2010

సదా మీ సేవలో

నాదెండ్ల ఆన్ లైన్ బ్లాగ్ వీక్షకులకు నమస్కారం. మన గ్రామం ఎంతో పురాతన మైనది. అనేక సంఖ్యలో ఉన్న దేవాలయాలు, చెరువులు, బావులు మొదలైన వాటి చరిత్ర, వివరాలను ప్రస్తుతం సేకరించటం జరుగుతున్నది. విషయ సేకరణ లో, విశ్లేషణ చేసి మీకు అందించుటలో విశ్వసనీయత కొరకు మేము ప్రయత్నిస్తున్నాము. నోటి మాటగా చెప్పుకునే దాని కన్నా, గ్రాంధికమైన, శాసనమైన ఆధారాలు అందించితే బాగుంటుంది కదా! మన గ్రామా చరిత్ర చెన్నై, హైదరాబాద్ లైబ్రరీ లలో దొరకవచ్చని తెలిసింది. వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాం. లోగా గ్రామంలో జరిగే ఉత్సవాల గురించి ఎప్పటికప్పుడు సవివరంగా తెలియజేయగలము.

త్వరలో మన బ్లాగ్ లో తెలుగు భాషలో బాలలకు సంబంధించిన ప్రక్రియ లైన జోల పాటలు, లాలి పాటలు, బాలల గేయాలు, పిల్లల కథలు మొదలైనవి అందించ దలచుకున్నాము. వాటి మిద మీ స్పందన ఆశిస్తున్నాము.

నాదెండ్ల గ్రామానికి దూరంగా ఉంటున్న వారి కొరకు ఒక కార్యక్రమాన్ని తలపెట్ట దలచాము. మీ పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి శుభకార్యాల సమయంలో లేదా మీరు కోరుకున్న సమయంలో గ్రామంలోని మీ ఇష్ట దైవానికి అభిషేకం, పూజ, ప్రసాదం వంటివి మీ పేరు మీద జరిపించ గలము. దీని కొరకు మీరు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. కొద్ది రోజుల ముందు మీ వివరాలు అనగా పేరు, గోత్రం తెలియ జేస్తే చాలు.

మరొక కార్యక్రమము ఏమంటే, మన బ్లాగ్ ద్వారా మీ అందరికీ పుట్టిన రోజు, పెళ్లి రోజు, మరియు సందర్భాను సారంగా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాము.ఆసక్తి ఉన్నవారు మీ వివరాలు తెలియజేయగలరు. మీ అందరిని ఒక వేదిక పైకి తేవటమే దీని ఉద్దేశం.బిడ్డలను చూసి గ్రామం ఆనందించాలి. గ్రామాన్ని చూసి బిడ్డలు ఆనందించాలి.

సదా మీ సేవలో...
కుమార స్వామి, శ్రీనివాసరావు .


Note: This post is published from 'CITY INTERNET AND CELL WORLD', KALAMANDIR CENTER, CHILAKALURIPET.

Sunday, August 1, 2010

తూబాడు విచ్చేసిన ముఖ్య మంత్రి 31-07-2010

తూబాడు గ్రామానికి విచ్చేయుచున్న ముఖ్య మంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించుటకు రాష్ట్ర మంత్రులు, శ్రీయుతులు డొక్కా మాణిక్య వరప్రసాద్, మోపిదేవి వెంకట రమణ, మాజీ MLA మర్రి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ శ్రీ రామాంజనేయులు, S.P. D.S.చౌహాన్ తదితర అధికారులు తూబాడు వెళ్లి వస్తూ గ్రామంలోని z.p. వైస్ చైర్మన్ శ్రీ నట రాజేశ్వర రావు గారు ఏర్పాటు చేసినా ఆతిధ్యాన్ని స్వీకరించి వెళ్లారు.

నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో ' పల్లెకు పోదాం సేవ చేద్దాం ' (రాహుల్ గాంధీ పిలుపు) కార్యక్రమ ముగింపు సమావేశము, మరియు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కొరకు రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ. కొణిజేటి రోశయ్య గారు తూబాడు గ్రామమునకు 31-ఆగష్టు -2010 విచ్చేసినారు. స్థానికుడైన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ. T.J.R. సుధాకర్ బాబు ఎంతో కృషి చేసి 1.5 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల కొరకు నిధులు మంజూరు చేయించారు.

note: this post is published from CITY INTERNET CENTRE, KALAMANDIR CENTRE, CHILAKALURIPET.