Wednesday, August 31, 2011

శ్రీ వినాయక వ్రత కల్పము

వీక్షకులకు నాదెండ్ల గ్రామ ప్రజలకు హృదయపూర్వక రంజాన్ మరియు వినాయక చవితి శుభాకాంక్షలు.

వినాయక వ్రతకల్పము మీ కోసం....










Tuesday, August 30, 2011

అబ్బకు తగ్గ కొడుకు

ఒక రోజు రామలింగడి కొడుకు రాజుగారి సభకు వచ్చాడు.వాడు అచ్చు వాళ్ళ నాన్న పోలికే. రాజు వాడిని
చూశాడు.ముచ్చటగా ఉన్నాడు అనుకున్నాడు.
అయితే వాళ్ళ నాన్నకున్న తెలివి తేటలు ఉన్నాయా అనిపించింది. వాడిని దగ్గరికి పిలిచాడు. వాడు పరుగెత్తుకొని
వచ్చాడు.రాజుకి దండం పెట్టాడు.
రాజు సంతోషించాడు. పదిరూపాయలు ఇవ్వబోయాడు. కానీ కుర్రాడి తీసుకోలేదు.
" ఏం ఎందుకు తీసుకోవు ?"అనడిగాడు రాజు."తీసుకో తప్పులేదు" అన్నాడు మళ్ళీ.

"వద్దు మా అమ్మ కోప్పడుతుంది" అన్నాడు ఆ కుర్రాడు.
"ఎందుకు" అనడిగాడు రాజు.
"ముక్కూ మొగం ఎరగనోళ్ల దగ్గర డబ్బు తీసుకోకూడదట. మా అమ్మ చెప్పింది "అన్నాడు వాడు.
"సెబాస్. ఆవిడ మంచి మాటే చెప్పింది కానీ నేను ముక్కూ మొగం ఎరుగని వాడిని కాదు, రాజుని గదా! తీసుకో

"అన్నాడు రాజు.
"అవును. తెలుసనుకోండి" అని నీళ్ళు నమిలాడు ఆ కుర్రాడు.
"మరింకా అనుమానమెందుకు?"రాజు నచ్చచెప్పాడు.

"మా అమ్మ నమ్మదు మరి" అన్నాడు వాడు.
"ఏం ఎందుకు నమ్మదు?" అడిగాడు రాజు.
"ఎందుకంటే నిజంగా ఆ డబ్బులిచ్చింది రాజు గారే అయితే ఆయన పది రూపాయలిస్తారా?బోలెడు ఇస్తారుగానీ

అంటుంది మా అమ్మ" అన్నాడు రామలింగడి కొడుకు.
దెబ్బతో వాడి తెలివి ఏమిటో రాజుగారికి తెలిసిపోయింది.కానీ ఆ జవాబుకి ఆయన తల తిరిగిపోయింది.
వాడికి మంచి కానుకలిచ్చి పంపించాడు.
కర్టెసీ: జన విజ్ఞాన వేదిక ( రామలింగడి ఏడు కథలు)

దేశమంతా పాపం పెరిగి పోతావుంది!!

సాయంత్రం 7.30, వర్షం తుంపరగా పడుతుంది. తిమ్మాపురం దగ్గర నాదెండ్ల రావడానికి ఆటో కొరకు కొంతమంది
ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటికి ఆటోవచ్చింది. అందరు ఆటోలో సర్దుకొని కూర్చున్నారు.గుంటూరు నుండి
వచ్చేవాళ్ళు, పేట నుండి ఇంకా సొంత పనుల మీద వివిధ ప్రాంతాలకు వెళ్లి వస్తున్నవారు. ఆటోలో సంభాషణ
మొదలయ్యింది.

గుంటూరు నుండి బోయపాలెం వరకు వర్షం బాగా కురిసింది. పేటలో ఎలా ఉంది?
పేటలో కూడా బాగానే పడింది.
మార్టూరులో కూడా బాగానే పడింది.
ఇంతకీ మన ఊళ్ళో ఎలా పడిందో
మన ఊళ్ళో పెద్దగా పడలేదంట. ఒక జల్లుపడి ఆగిపోయిందట.
చుట్టూ వాన బాగానే పడుతుంది. మన ఊరికి మాత్రం అంతగా పడట్లేదు.17 సంవత్సరాల తర్వాత నీళ్ళుపోసి పడి
విత్తనాలు వేసాం.
అవున్రా ఊళ్ళో పాపం పెరిగిపోతుంది.అందుకే వాన పడట్లేదు.
అరే పాపం లేనిదెక్కడరా!? దేశమంతా పాపం పెరిగి పోతావుంది.
అదేంకాదులే చలం కొండలు కొట్టుకొని వెళుతున్నారు.అందరం చూస్తున్నాం. ఇదేంటి అని అడిగే నాధుడు లేడు.చలం
కొండలు దేవుడి కొండలు.అందుకేరా నాయనా ఇట్లా అవుతుంది.
అవును నిజమేరా! మునులు తిరుగుతుంటే చూసిన వాళ్ళుకూడా ఉన్నారట. మా చిన్నప్పుడు చెప్పుకునే
వాళ్ళు.అలాంటి దేవుడి కొండలు కొట్టడం తప్పుకదా.
కాని ఏం చేద్దాం ఎలా జరగాలనుకుంటే అలా జరుగుతుంది. మన చేతిలో ఏం ఉంది.
ఊరు వచ్చింది. ఒక్కొకరు తమ ఇంటి వద్ద ఆటో దిగి వెళ్ళిపోయారు.
... ఈమధ్య కాలంలో ఎక్కువగా వినపడే సంభాషణ ఇది. ..(ఇప్పుడు మన గ్రామాన్ని కూడా వర్షాలు పలకరిస్తున్నాయి!!)

పొలం పనులు (ఆగష్టు 2011)

అరక
నాటుకు సిద్ధం చేసిన సాళ్ళు

పొలానికి మందు వేయడానికి వెళ్తూ..

గణపవరం దగ్గర కుప్పగంజి వాగు

వరలక్ష్మి వ్రతం ( నాలుగవ శుక్రవారం ) అమ్మవారి ఆలయం

శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు
భజన చేస్తున్న భక్తులు

Monday, August 29, 2011

శివాలయం వీధి పెద్దబడికి కాట్రగడ్డ మస్తాన్ రావు గారి వితరణ

గ్రామ సర్పంచ్ మరియు ప్రధానోపాధ్యాయులకు కంప్యూటర్ బహుకరిస్తున్న శ్రీ కాట్రగడ్డ మస్తాన్ రావు గారు.

కంప్యూటర్ ను ప్రారంభిస్తున్న Z.P. హై స్కూల్ H.M శ్రీ . ఆంజనేయులు గారు.

కోటప్పకొండ పాదయాత్ర - శేష భాగం



నిండైన చింత చెట్టు.

తోట అంచున చెట్ల వరుస స్వచ్ఛమైన గాలి..

వంపులేని తాటి చెట్టు!

పోతవరం సమిపంలోగల కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయం ( మైనార్టీలు)
పోతవరం

పంచాయతి కార్యాలయం, పోతవరం

మద్దిరాల సమిపంలోగల జవహర్ నవోదయ విద్యాలయం

ప్రాధమిక పాఠశాల , మద్దిరాల ( పేట నుండి పది కిలో మీటర్లు)

టిఫిన్
పది కీ.మీ. నడిచాక కండరాల నొప్పులు మొదలు
మరో 6 కీ.మీ. దూరంలో కోటప్ప కొండ
ఎడవల్లి సమీపం లోని ఎత్తిపోతల పథకము
హై పవర్ విద్యుత్తీగలు

సాయి బాబా ఆలయం, ఎడవల్లి

కట్టుబడివారి పాలెం (E.T)


చేదుకో కోటయ్య చేదుకో..!!
సుమారు 11 గంటలకు ( బయలుదేరిన నాలుగున్నర గంటలకు) కొండ దిగువ భాగానికి చేర గలిగాం.

కొండపైన ఆలయం

కొండపైకి జీపులో ప్రయణించాము . అలసిపోయినా అనుకొన్న ప్రయాణం ముగించినందుకు సంతోషంగా ఉంది. నూతనోత్సాహం కలిగింది. ఈ పాద యాత్ర కు నాతో సహకరించిన మిత్రుడు కాశీకి ధన్యవాదాలు.

Thursday, August 25, 2011

24-08-2011 విశేషాలు (ప్రత్తి మొక్కలు, పిల్లలకు యూనిఫాం , ధర్నామొదలైనవి )



జనుము
*************************************************************************************

ప్రభుత్వం వారిచే ఉచితంగా అందించబడిన యూనిఫామ్ తో CD పాఠశాల విద్యార్ధులు
*************************************************************************************


ఫిరంగిపురం మండలం అల్లంవారి పాలెం ZP హై స్కూల్ ఉపాధ్యాయుడు . వెంకట రమణ DEO వేధింపుల కారణంగానే మరణించాడని ఆరోపిస్తూ ఉపాధ్య సంఘాల పోరాట సమితి ర్యాలి నిర్వహించింది.
*************************************************************************************
నెల 22 తో సర్పంచుల పదవీ కాలం ముగిసింది.
*************************************************************************************
చిలకలూరిపేట లో పద్మనాభ హోటల్ NRT సెంటర్ లో ఉంది. సాంబార్ ఇడ్లీ చాల ఫేమస్.

Tuesday, August 23, 2011

చిలకలూరిపేట నుండి కోటప్పకొండకు పాదయాత్ర (31-07-2011)

1990 లేదా 1991 సంవత్సరం శివరాత్రి రోజు కోటప్ప కొండ వద్ద రాత్రి పూట విపరీతమైన వర్షం కురిసింది. తిరునాళ్ళకు వచ్చిన లక్షలాది మంది భక్తులు చెల్లా చెదురయ్యారు. కరెంటు లేదు. ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ నిలిచిపోయింది. కొండ కింద ప్రభల వద్ద ఉన్న జనాలు నిలువెల్లా తడిచి ముద్దయ్యారు. ఇక రాత్రి వేళ చాల మంది కాలి నడకన ఇంటిముఖం పట్టారు. సరదాగా పదిమంది స్నేహితులము నాడు తిరునాళ్ళకు వెళ్ళాము. కొండ పైన గుడికి వెళ్ళటమే కాకుండా, ఇంకా పైకి బొచ్చు కోటయ్య గుడి వరకు వెళ్లి( మెట్లు ఉండవు), కొండ చివర అంచున కిందకు దిగాము. చీకటి పడి ప్రభల దగ్గర అప్పుడే విద్యుత్ దీపాలు ప్రకాశిస్తున్నాయి. అలసి పోయి నెమ్మదిగా ఒక్కొక్క ప్రభను చూసుకుంటూ పొలాలలో నడుస్తున్న మాకు పెద్ద ఎత్తున వర్షం దిగ్బ్రాంతిని కలుగజేసింది.కుర్రతనం కావటం వల్లనేమో వర్షంలోనే చిలకలూరి పేట కు నడవటం మొదలు పెట్టాము. ( జనమంతా అలానే నడుస్తున్నారు). వర్షం దెబ్బకు తల దాచుకునేందుకు అందరం తలోదిక్కు అయ్యాము. మిత్రుడు నరసింహ నాకు తోడు. ఎడవల్లి వరకు అలా వర్షంలోనే నడిచాము. అక్కడ ఒక గొడ్ల చావిట్లో కాసేపు సేద తీరి ఒళ్ళు అరబెట్టుకుని, తడిచిన బట్టలతోనే, మరల నడక సాగించాము. ఎడవల్లి సప్టా మీదుగా నడుములోతు నీళ్ళు ప్రవహిస్తున్నాయి.నరసింహ,నేను చేతులు కలిపి సప్టా దాటటం ఇంకా మరచిపోలేదు. (నాకు అండ, కండ నరసింహ). పోతవరం దగ్గ వేకువజామున తిన్న పకోడిలా వేడి ఇంకా గుర్తుంది. అలా తెల్లవారి 4 లేదా 5 గంటల సమయంలో పేట చేరాము. ఆనాడు వర్షం పడటం మంచిదేనని, లేకుంటే ప్రభల దగ్గర గొడవలై, బాంబులు విసురుకునే వాళ్ళని జనం చెప్పుకున్నారు.( ఒక ప్రభని చూస్తే అది పార్టీ వారి ప్రభో ఇట్టే అర్ధమై పోతుంది.).అప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు. ఇది మా పాదయాత్రకు 20 ఏళ్ళ నాటి నేపద్యం.
వయసు పెరిగింది. బరువు పెరింది. పొట్ట అదుపు తప్పింది. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవలసిన పరిస్థితి. నాదెండ్ల స్కూల్ కి వెళ్ళే నన్ను ప్రతి రోజు పేట శివారు దాటగానే కోటప్పకొండ పలకరిస్తుంది. మరల ఇప్పుడు కోటప్పకొండకు నడిస్తే ఎలా ఉంటుంది అన్న ఊహ మనసులోకి రావటం మొదలైంది. కొంత మంది మిత్రులు పెదవి విరిచారు. కొంతమంది రిస్క్ అన్నారు. నరసింహ మాత్రం సరే అన్నాడు.కానీ వాడు ప్రస్తుతం హైదరాబాద్ లో సెటిల్ అయాడు. ఇంతలో మిత్రుడు కాశి ( కాశీ విశ్వనాధ్) నేను రెడీ అన్నాడు. 30-08-2011(శనివారం) సాయంత్రం కాశీ రేపు కొండకి నడిచి వెళ్దాం అన్నాడు. నేను తటపటాయించాను కానీ తను కృత నిశ్చయం తో ఉన్నాడు. రేపు పెందలకడనే లేచి ప్రయాణానికి సిద్దం కావాలి.


కొంచెం అసాధారణమైన పని. కొంచెం భిన్నమైన పని. తలంపు తో శరీరం లో కొద్దిగా పెరిగిన వేడి. ప్రయాణానికి ముందు ఉద్విగ్నంగా అనిపించింది. ప్రయత్నానికే ఇలా అనిపిస్తే మరి, వివిధ రంగాలలో దేశానికీ ప్రాతినిధ్యం వహించే వారి స్థితి, రికార్డుల కోసం తపన పడేవారి మానసిక స్థితి, మాటకొస్తే రంగంలోనైన సఫలీకృతులవ్వాలనుకునే వారి మనో ధైర్యం తలపుకొచ్చాయి. ఆదివారం ఉదయాన్నే6.30 గంటలకు కోటప్ప కొండకు చిలకలూరి పేట నుండి నడక ప్రారంభించాము. సుమారు 16 కిలోమీటర్లు.
పురుషోత్తమపట్నం
పోలేరమ్మ తల్లి గుడి
వినాయకుని గుడి
బొప్పూడి కొండ


ఇటుక బట్టీలు

to be continued. .

Monday, August 22, 2011

CD పాఠశాలలో ఉచిత దుస్తుల పంపిణీ

గ్రామంలోని అంబేద్కర్ నగర్ లో గల సీ.డి. పాఠశాల లో రోజు ఉచిత దుస్తుల పంపిణీ జరిగినది. కార్యక్రమానికి మండల తహసిల్దార్ శ్రీ M.V. సుబ్బారావు గారు, మండల M.E.O. శ్రీ R. కళ్యాణ రావు గారు, R.I. శ్రీ నాగమల్లేశ్వర రావు గారు, MRP మధు అతిధులుగా విచ్చేసారు. సమావేశానికి H.M.శ్రీ G. బ్రహ్మాజీ గారు అధ్యక్షత వహించారు. సందర్భంగా మధ్యాహ్న భోజన పథక అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపారు.

H.M. శ్రీ G. బ్రహ్మాజీ గారు.

విద్యార్ధులు


తహశిల్దార్ శ్రీ M.V. సుబ్బారావు గారు.

M.E.O. శ్రీ R. కళ్యాణరావు గారు.

R.I. శ్రీ నాగ మల్లేశ్వర రావు గారు.