Sunday, August 26, 2012

జన్మభూమికి చేయూత- చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు

నాదెండ్ల గ్రామస్తులందరికీ శుభవార్త. నాదెండ్ల గ్రామం నుండి వెళ్లి వేరు, వేరు ప్రాంతాలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారు చాల మంది ఉన్నారు. వారి నందరిని ఒక వేదిక మీదకు తీసుకు వచ్చి, అందరి సహకారంతో గ్రామ అభివృద్ధికి చేయుట నిచ్చే ఒక బృహత్తర కార్యక్రమం జరగబోతుంది.దీని కొరకై ఒక అసోసియేషన్ లేదా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు కాబోతుంది.దీనిలో నాదెండ్ల గ్రామానికి చెందిన అందరు భాగస్వాములు కావాలని మా ఆకాంక్ష.మనలో చాల మంది విడి విడిగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలా కాకుండా అందరు కలిసి చేస్తే సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. గడ్డి పోచలు విడిగా ఉంటే తేలికగా తెగి పోతాయి. ఆ గడ్డి పోచలు అనేకం కలసి ఒక తాడులాగా తయారైతే ఒక మద గజాన్ని సైతం బంధించ గలుగుతాయి కదా!

ఏ మొత్తం కార్యక్రమాన్ని శ్రీ నల్లమోతు జయరాం గారు (USA ) అయన మిత్రుల సహకారంతో పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే చాల ఆలస్యం జరిగిపోయింది. ఆలోచించి సమయం వృధా చేయకుండా కార్యక్రమాలు మొదలు పెట్టాలని అయన చెప్పారు. దీని కొరకై అందరు కూడా మీ వద్ద ఉన్న మన మిత్రుల email -id లు , ఫోన్ నెంబర్ లను జయరాం గారికి పంపించవలెను. మీ అభిప్రాయాలూ, సలహాలు, సూచనలు నిరభ్యంతరంగా తెలియజేయవలెను. ఏ కార్య క్రమంలో నాదెండ్ల గ్రామానికి చెందిన అందరూ పాలు పంచుకోవాలనీ, గ్రామాభివృద్ధికి తోడ్పడాలనీ జయరాం గారు విజ్ఞప్తి చేస్తున్నారు.
జయరాం గారిని సంప్రదించుటకు:

Telephone: 7193103358 (Mobile)
EmailId: JayaramNallamothu@yahoo.com

Sunday, August 19, 2012

నల్లమోతు రాజా చారిటబుల్ ట్రస్ట్, నాదెండ్ల

కీ.శే. నల్లమోతు రాజా గారి స్మృత్యర్ధం నల్లమోతు రాజా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారు తెలిపారు. ట్రస్ట్ తరపున చేసిన సేవ కార్యక్రమాలు ఆయన వివరించారు. నాదెండ్ల గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం లోని బాలలకు పెన్నులు, పుస్తకాలు, అట్టలు పంపిణీ చేసారు.

నల్లమోతు కోటేశ్వరరావు గారు, నల్లమోతు హరి బాబు గారు




******************

నాదెండ్ల గ్రామంలోని పెద్దబడి లోని విద్యార్ధులకు బాలల రచయిత శ్రీ దార్ల బుచ్చి బాబు గారు రచించిన బాలల కథల పుస్తకాలను ట్రస్ట్ ఉచితంగా అందజేసింది. ఏ కార్యక్రమంలో శ్రీ నల్లమోతు కోటేశ్వరరావు, మండల విద్యాశాఖాధికారి శ్రీ రాజనాల కళ్యాణరావు గారు,పాఠశాల ఉపాధ్యాయులు, రచయిత శ్రీ దార్ల బుచ్చి బాబు గారు పాల్గొన్నారు.
పెద్ద బడి

MEO శ్రీ R. కళ్యాణరావు గారు, శ్రీ N. కోటేశ్వరరావు గారు, శ్రీ దార్ల బుచ్చి బాబు గారు

బాలల కథ పుస్తకాలను ప్రదర్శిస్తున్న ఆహుతులు
************

ధర్మచలివేంద్రం

Wednesday, August 15, 2012

ఆగస్టు 15 పతాక ఆవిష్కరణ - నాదెండ్ల

అంబేద్కర్ నగర్ సెంటర్ నందు C.D. పాఠశాల విద్యార్ధులు, ఉపాధ్యాయులు, కాలనీ వాసులు, మరియు అమరమ్మ గారు, జగన్నాధమ్మ గారు పతాక ఆవిష్కరణ లో పాల్గొన్నారు.


********************
C.D. పాఠశాల లో జెండా వందనం





పాఠశాల లో గత సంవత్సరం విద్యా వాలంటీర్ గా పనిచేసిన శ్రీమతి సదా లక్ష్మి గారికి జ్ఞాపిక అందజేస్తున్న ఉపాధ్యాయ బృందం
************************

MRO ఆఫీసు

MDOఆఫీసు

పోలీసు స్టేషన్
పంచాయతి కార్యాలయం


Tuesday, August 14, 2012

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు

వీక్షకులకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు
ఫోటో కర్టెసీ: flickr

olympics లో పతకం సాధించిన భారతీయ క్రీడాకారులు

విజయ్ కుమార్, సుశీల్ కుమార్, యోగీశ్వర్ దత్, సైనా నెహ్వాల్, మేరీ కోం, గగన్ నారంగ్

Friday, August 10, 2012

అంకమ్మ తల్లి కొలుపులు-మాతంగి




నాదెండ్ల గ్రామంలో 4-08-2012 నుండి అంకమ్మ తల్లి కొలుపులు జరుగుతున్నాయి. తొమ్మిదిరోజుల కొలుపులు జరుగుతాయి. 06-08-12 జలబిందెలు అనే కార్యక్రమం నిర్వహించారు.
మాతంగి

సాయి బాబా మందిర మొదటి అంతస్తు పై కప్పు ( స్లాబ్) నిర్మాణం 06-08-2012

















ది. 06-08-2012 నాదెండ్ల గ్రామంలోని కచేరి వేప చెట్టు సమీపంలో గల సాయి బాబా మందిరమునకు మొదటి అంతస్తు పైకప్పు నిర్మాణం జరిగినది. విశాలమైన మందిర పైకప్పు నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ఉత్తరం, దక్షిణం రెండు వైపుల నుండి స్లాబ్ వేయడం మొదలు పెట్టి విజయవంతం గా పూర్తి చేసారు కమిటి సుభ్యులు.

Saturday, August 4, 2012

కంగ్రాట్స్ సైనా

సైనా నెహ్వాల్ లండన్ olympics షటిల్ బాడ్మింటన్ లో కాంస్య(బ్రాంజ్) పతకం సాధించింది. సిడ్నీ olympics 2000 లో భారతీయ మహిళలలో వ్యక్తిగతం గా పతకం సాధించిన కరణం మల్లేశ్వరి (వెయిట్ లిఫ్టింగ్) తరువాత 12 సంవత్సరాలకు ఆమె ఘనత సాదించింది. దీనితో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. కంగ్రాట్స్ సెహ్వాల్. కృషి, పట్టుదల ఎప్పటికీ గుర్తింపబడతాయి. తన ప్రత్యర్ధి ఆధిక్యంలో ఉన్నప్పటికీ మోకాలి గాయం కారణంగా మధ్యలో వైదొలిగింది. వత్తిడిని అధిగమించటం సాధన చేస్తే సెహ్వాల్ మరింత మెరుగ్గా రాణించగలదు .

సాయి బాబా మందిరమునకు స్లాబ్ వేయుటకు ఏర్పాట్లు



నాదెండ్ల కచేరి వేప చెట్టు సెంటర్ దగ్గర నిర్మించబడుతున్న సాయి బాబా మందిరమునకు 6-8-12 సోమవారం నాడు స్లాబ్ వేయనున్నారు.

మా బడిలో కవల పిల్లలు

నాదెండ్ల అంబేద్కర్ నగర్ లోగల C.D పాఠశాల నందు 3 తరగతి చదువుతున్న చిన్నారి కవల జంట పేర్లు మరియ(ఎడమ) , మార్త. వీరిలో మరియ ముందు పుట్టింది.

మొలకెత్తిన పంట మొక్కలు

ప్రత్తి పసుపు

రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతం లో ఏర్పడ్డ అల్ప పీడనం వాళ్ళ జల్లులు పడనున్నాయి. అవి మొక్కలకు బాగా ఉపయోగ పడతాయి.